రాజధాని మార్చే అధికారం సీఎం జగన్కు లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని మారుస్తామంటున్న జగన్.. వెంటనే ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో మూడు ప్రాంతాల్లోనూ ప్రభుత్వం తగువులు పెడుతుందని చంద్రబాబు ఆరోపించారు. పరిపాలన చేతకాక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బుధవారం అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా న్యూ ఇయర్ వేడుకలకు చంద్రబాబు దూరంగా ఉండనున్నారు.