13 జిల్లాల ప్రజలు రాజధాని మార్పుపై పోరాడకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా ఏపీ వెళ్తుందన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రానున్న కాలంలో ఏపీలో జీతాలు, పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను బట్టి కేంద్రం ఆలోచన ఉంటుందన్నారు. సీఏఏకు మద్దతుగా కడపలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సుజనా పాల్గొన్నారు.