బొత్సకు నిరసన సెగ.. కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ నేతలు

Update: 2020-01-04 11:46 GMT

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజధానిపై మంత్రి బొత్సను నిలదీశారు టీడీపీ నేతలు. రాజధాని వ్యవహారాన్ని వెంటనే తేల్చాలని బొత్స కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేత, శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌. దీంతో పోలీసులు పీఆర్‌ మోహన్‌ను పక్కకు నెట్టేశారు. నిరసనలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Similar News