అమరావతి విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాయపాటి

Update: 2020-01-13 14:47 GMT

అమరావతి విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కేంద్రం అన్నీ గమనిస్తోందని.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. మందడంలో దీక్ష నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాజధాని మన దగ్గరికి వచ్చిందనే రైతులు భూములిచ్చారని.. ఇప్పుడు మూడు రాజధానులు అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చి ఉద్యోగం ఉపాధి కల్పించాలి తప్ప.. కేవలం మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యం కాదని రాయపాటి సాంబశివరావు అన్నారు.

Similar News