అన్ని పార్టీల అధిష్టానాలు ఢిల్లీలో వుంటే.. టీఆర్ఎస్ అధిష్టానం తెలంగాణ గల్లీలో వుందన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే ప్రధానమని.. అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు.. విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని.. తమ అభ్యర్థులకు మెజారిటీ పరంగానే పోటీ వుందని తెలిపారు.