15 మంది రైతులు చనిపోతే స్పందించని పోలీసులు.. ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలితే స్పందించారు: లోకేష్
ఎప్పుడూ లేనివిధంగా రాజధాని కోసం మహిళలు రోడ్డెక్కారని లోకేష్ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళలను కులం అడిగి, కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. 15 మంది చనిపోతే స్పందించని పోలీసులు.. ఓ ఎమ్మెల్యే కారు అద్దాలు పలిగితే మాత్రం స్పందించారని అన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు పోరాడతామని లోకేష్ స్పష్టం చేశారు.