అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో 8వ అంతస్థుకు ఎక్కి నినాదాలు చేశారు రాజధాని రైతులు. ముగ్గురు రైతులు బిల్డింగ్పై ఎక్కి నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని ప్రకటించకపోతే.. బిల్డింగ్ను దూకుతామంటూ హెచ్చరించారు. ప్రాణాలైనా అర్పించి.. రాజధానిని సాధించుకుంటామన్నారు అమరావతి రైతులు.