గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ షరీఫ్, పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.