ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ని అమరావతి జేఏసీ నేతలు కలిశారు. రాజధాని అమరావతి కోసం వారు చేస్తున్న ఉద్యమ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని శైలజానాథ్ను కోరుతూ వినతిపత్రం అందించారు. అమరావతి ఉద్యమానికి పూర్తిగా కాంగ్రెస్ మద్దతిస్తుందని శైలజానాధ్ హామీ ఇచ్చారన్నారు. శనివారం రాజధాని రైతులతో కలిసి ఢిల్లీ వెళ్తామని.. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీని కలుస్తామని జేఏసీ నేతలు అన్నారు.