క్విడ్‌ప్రోకో, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బ్రాండ్ అంబాసిడర్ జగన్: నిమ్మల రామానాయుడు

Update: 2020-02-04 17:37 GMT

క్విడ్‌ప్రోకో, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ జగనే అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఎక్కడైనా అవినీతిని వెలికితీసేటప్పుడు గుట్టలకొద్దీ వస్తుందని.. కానీ, అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఫైరయ్యారు. 24వేల ఎకరాల భూస్కామ్‌ జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు తమ అధికార పత్రికలో 600 ఎకరాలకు పరిమితం చేశారని.. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా వచ్చిన వివరాలు చూస్తే 125 ఎకరాలే అని తేలిందని గుర్తు చేశారు. లేనిది ఉన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు.

Similar News