రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో మరో రైతు మృతి చెందాడు. తుళ్లూరుకు చెందిన జమ్ముల హనుమంతరావు గుండెపోటుతో మరణించాడు. రాజధాని తరలింపు నిర్ణయంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం సాయంత్రం తుళ్లూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. బుధవారం గుండెపోటు రావడంతో హనుమంతరావు కన్నుమూశారు.