ఏపీ మండలి రద్దు అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు ఎంపీ కనకమేడల రవీంద్ర. సెలెక్ట్ కమిటీ రూల్స్కు విరుద్ధంగా మండలిని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారనే కోపంతో ఆవేశంగా మండలిని రద్దు చేశారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు కనకమేడల.