ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళన, రాష్ట్ర అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏమాత్రం ఆలోచన లేదని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. రాజధాని కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. అమరావతికే మద్దతంటున్న బీజేపీ.. ప్రకటనలకే పరిమితం అవుతోందని.. పవన్ కళ్యాణ్ను సైతం కట్టడి చేశారని ఆయన ఆరోపించారు. జగన్ నియంతృత్వానికి కేంద్రం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.