పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు మృతి

Update: 2020-02-20 21:04 GMT

గుంటూరు జిల్లాలో రోడ్దు ప్రమాదం జరిగింది. చుండూరు మండలం చిన్నపరిమి వద్ద పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా తెనాలి మండలం చినరావురుకు.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

Similar News