నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో టీడీపీ కార్యకర్త పల్లా సుజిత్పై కత్తులతో దాడి చేశారు. చావు బతుకుల మధ్య ఉన్న సుజిత్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆధిపత్యం కోసమే సుజిత్ను హత మార్చేందుకు వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారని బంధువులు ఆరోపించారు.