చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను ఓ వైపు కరోనా భయపెడుతుంటే.. కర్ణాటకలో మరో ప్రమాదకర వైరస్ వణుకు పుట్టిస్తోంది. శివమొగ్గ జిల్లాలో మొదలైన మంకీ ఫీవర్ అనే కొత్త వైరస్ ఉత్తర కన్నడ జిల్లాలో విజృంభిస్తోంది. కోతుల ద్వారా సోకే ఈ వైరస్ దెబ్బకు నెల కిందట శివ మొగ్గ జిల్లా సాగర్లో 58 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఆదివారం ఉత్తర కన్నడలోని సిద్ధాపురకు చెందిన భాస్కర గణపతి హెగ్డే మృతి చెందాడు. ఒక్క శివమొగ్గలోనే ఇప్పటి వరకు 55 మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది.