ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5 వేలు.. దిల్లీ సీఎం సంచలన నిర్ణయం

Update: 2020-04-02 20:03 GMT

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దిల్లీలో ఉపాధి కోల్పోయిన ఆటో రిక్షా, గ్రామీణ్‌ సేవా, ఈ-రిక్షా డ్రైవర్లకు రూ.5000 వేలు చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వివరించారు. అయితే, ఇది అమలు చేసేందుకు దాదాపు వారం నుంచి పది రోజుల లోపు సమయం పడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Similar News