గడిచిన 24 గంటల్లో 909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 8,356కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆరోగ్యశాఖ.. గత 24 గంటల్లో 34 మంది కరోనా కారణంగా మృతిచెందారని.. మొత్తం మృతుల సంఖ్య 273కు చేరిందని తెలిపారు. కాగా.. ఇప్పటివరకు 716 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.
అటు.. కరోనా ప్రభావం ఇంకా పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.