ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రెండున్నరేళ్ల బాలుడు కరోనాపై పోరాటంలో విజయం సాధించాడు. ఉత్తర్ప్రదేశ్లో కరోనా వైరస్ బారిన పడిన రెండున్నరేళ్ల బాలుడు కరోనా మహమ్మారిని జయించాడు. కొద్దిరోజుల క్రితం బాలుడితో పాటు అతని తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాలుడికి నిర్వహించిన రెండు టెస్టుల్లోనూ కరోనా నెగిటివ్గా తేలింది. దీంతో బాలుడిని డిశ్చార్జ్ చేసినట్లు కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ వైద్యులు తెలిపారు.