ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి

Update: 2020-04-13 17:46 GMT

దేశ రాజధానిలో మరోసారి భూప్రకంపించింది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కంపించిన భూమి.. సోమవారం మరోసారి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై భూ ప్రకంపనలు 2.7గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో రెండోసారి భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భయాందోళనతో ఇళ్లలోంచి బయటకు పరుగు తీశారు. అయితే.. దీని వలన ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలుస్తోంది.

Similar News