ఇమ్మ్యూనిటీ పవర్ ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చని.. ఈ వ్యాధి నుంచి కోలుకున్న ఓ వ్యక్తి తెలిపారు. కోల్ కతా నగరానికి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఛటర్జీ అనే వ్యక్తి కరోనా బారి నుంచి బయటపడి డిశ్చార్జ్ అయ్యారు. అంతరం మీడియాతో మాట్లాడుతూ.. రోగనిరోధక శక్తి ఉంటే నామమాత్రపు మందులతోనే కరోనా నుంచి బయటపడవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కష్టసమయంలో తనకు చికిత్స చేసిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఛటర్జీ కృతజ్ఞతలు తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా వృద్ధులు కరోనా బారిన పడుతున్నరని ఆయన తెలిపారు. తనకు జ్వరం, తుమ్ములు, దగ్గు లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ అని వచ్చిందని డాక్టర్ చెప్పారని ఆయన తెలిపారు. తనకు రెండుసార్లు పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని ఆయన పేర్కొన్నారు.