దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిపై పోరాటంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు హర్యానా సర్కార్ అండగా నిలిచింది. జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తూ హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ గురువారం ఓ ప్రకటన చేశారు.