జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్లతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ను మోదీ ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు గ్రామస్వారాజ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అవార్డులు ఇచ్చారు. వివిధ రాష్ట్రలకు చెందిన మంత్రులు, సర్పంచ్లతో మోడీ మాట్లాడారు. కరోనా లాక్డౌన్ను పాటిస్తున్న విధానాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు