కరోనా కోసం ఔషధాన్ని సిద్ధం చేస్తోన్న స్ట్రైడ్స్‌ ఫార్మా

Update: 2020-04-29 16:33 GMT

కరోనా చికిత్సలో వినియోగించే ఫెవిపిరవీర్‌ యాంటివైరల్‌ ట్యాబ్లెట్స్‌ను డెవలప్‌ చేయనున్నట్టు స్ట్రైడ్‌ ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. 400 ఎంజీ, 200 ఎంజీ మోతాదుల్లో ఈ ఔషధాన్ని డెవలప్‌ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. బెంగళూరులోని యూనిట్‌లో ఈ ట్యాబ్లెట్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ వైరస్ మహమ్మారి నుంచి కోలుకునేందుకు తమ ఔషధం చక్కగా పనిచేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

Similar News