గడచిన 24 గంటల్లో 3900 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-05-05 13:06 GMT

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 195 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి 1568 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News