కుప్పకూలిన మిగ్‌-29 ఎయిర్‌క్రాఫ్ట్‌

Update: 2020-05-08 14:52 GMT

పంజాబ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జలంధర్‌కు సమీపంలోని ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి బయల్దేరిన మిగ్‌-29 ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం సంభవించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు.

Similar News