మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి 1400 మంది వలస కూలీలను శ్రామిక్ రైల్ ద్వారా ఒడిషాకు తరలించారు. తాడేపల్లి, చిలకలూరిపేట, మంగళగిరి ప్రాంతాల నుండి వలస కార్మికులు తమ స్వస్థలాలకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సోమవారం రాత్రి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి.. మొదట మంగళగిరి రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి శ్రామిక్ రైళ్లలో వారిని సొంతూళ్లకు పంపించారు.