కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని.. ఆర్థిక ప్యాకేజీ విషయంలో ప్రధాని పునరాలోచించాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ లాక్ డౌన్ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని కోరారు. భారత్ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర కీలకమన్న రాహుల్.. పేదలకు ప్రత్యక్షంగా నగదు సాయం చేయాలని డిమాండ్ చేశారు.