పార్టీ మారుతున్నానన్న వార్తలు నన్ను చాలా బాధించాయి: టీడీపీ ఎమ్మెల్యే

Update: 2020-05-31 19:53 GMT

పార్టీ మారుతున్నానన్న ప్రచారానికి తెరదించారు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. తనకు పార్టీ మారే ఉద్ధేశం లేదని.. టీడీపీతోనే ఉంటానని అన్నారు. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం బాధించిందన్నారు. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏలూరి సాంబశివరావు.. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నానని చెప్పారు.

Similar News