ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మంగళవారం హస్తినకు బయల్దేరాల్సి ఉంది. మంగళవారం రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశం కావాల్సి ఉంది.
ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ.. సాయంత్ర 5 గంటల సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో శాస్త్రి భవన్లో సమావేశం.. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు అమిత్షాతో సమావేశం కావాల్సి ఉంది. అయితే జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.