రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. జగన్ బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అరెస్టును ఆయన ఖండించారు. జగన్పై ఈడీ కేసు పెట్టాలని మొదట చెప్పింది ఎర్రం నాయుడేనని.. అందుకే వారి కుటుంబంపై కక్ష కట్టారని అయ్యన్న పాత్రుడు అన్నారు.