బెంగళూరులో 19 ప్రైవేటు హాస్పిటల్పై వేటు పడింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో సర్కార్ ఆదేశాలను పాటించని 19 ప్రైవేటు హాస్పిటల్ల లైసెన్సులను బీబీఎంపీ అధికారులు రద్దు చేశారు.
కరోనా రోగులకు ప్రైవేటు హాస్పిటల్లో తప్పనిసరిగా 50 శాతం పడకలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారిచేసింది. అయితే సర్కార్ ఆదేశాలను పాటించని 19 ప్రైవేటు హాస్పిటల్ల అనుమతులను రద్దు చేసినట్టు బెంగళూరు సౌత్ జోన్ ఆరోగ్య అధికారి డాక్టర్ శివకుమార్ తెలిపారు. 'విపత్తు నిర్వహణ చట్టం, 2005' ప్రకారం సదరు హాస్పిటల్స్పై కేసులు నమోదు చేశామన్నారు.