కాకినాడలోని సూర్యకళామందిర్లో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మే 8న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మత్స్యకార గర్జన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చలో ఉప్పాడ కార్యక్రమం బ్రోచర్ను విడుదల చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే జనగణన జరగాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఐక్యకార్యచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసింది.