ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు

తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,809 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 125 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Update: 2021-01-29 15:00 GMT

coronavirus(File Photo) 

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,809 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 125 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,87,591కి చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 175 మంది పూర్తిగా కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య 8,79,131కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,152 మంది బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,308 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,30,54,959 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.


Tags:    

Similar News