ACCIDENT: తీరని శోకాన్ని మిగిల్చిన ప్రమాదం

మాడి మసైపోయిన మృతదేహాలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. బెంగళూరు వెళ్తున్న టెకీ కూడా మృతి

Update: 2025-10-24 09:30 GMT

కర్నూ­లు జి­ల్లా­లో జరి­గిన ప్ర­మా­దం చాలా కు­టుం­బా­ల్లో తీ­ర­ని శో­కా­న్ని మి­గు­ల్చిం­ది. ఈ ప్ర­మా­దం­లో ఓ కు­టుం­బం మొ­త్తం మర­ణిం­చ­డం వి­షా­దా­న్ని నిం­పిం­ది. నె­ల్లూ­రు జి­ల్లా విం­జ­మూ­రు మం­డ­లం గొ­ల్ల­వా­రి­ప­ల్లి గ్రా­మా­ని­కి చెం­దిన కు­టుం­బం అగ్ని­కి ఆహు­తైం­ది. నె­ల్లూ­రు జి­ల్లా గొ­ల్ల­వా­రి­ప­ల్లి గ్రా­మా­ని­కి చెం­దిన గో­ళ్ల రమే­శ్ (35) కు­టుం­బం బెం­గ­ళూ­రు­లో జీ­వ­నం సా­గి­స్తుం­ది. రమే­శ్ ప్రొ­డ­క్ట్ సే­ల్స్ ఆఫీ­స­ర్‌ జాబ్ చే­స్తు­న్నా­రు. రమే­శ్‌­కు భా­ర్య అనూష (32), పి­ల్ల­లు మన్విత (6), యశ్వం­త్ (8) ఉన్నా­రు. దీ­పా­వ­ళి సె­ల­వుల కోసం రమే­శ్ కు­టుం­బం హై­ద­రా­బా­ద్‌­లో­ని వారి బం­ధు­వుల ఇం­టి­కి వచ్చిం­ది. గత రా­త్రి వీరు హై­ద­రా­బా­ద్ నుం­చి ప్రై­వే­ట్ బస్సు­లో బెం­గ­ళూ­రు­కు బయ­లు­దే­రా­రు. ఈ ప్ర­మా­దం­లో వీరు నలు­గు­రు మర­ణిం­చా­రు.

టెక్కీ మృతి

బస్సు ప్ర­మాద ఘట­న­లో ఇం­కొ­ల్లు మం­డ­లం పూ­స­పా­డు గ్రా­మా­ని­కి చెం­దిన గన్న­మ­నే­ని ధా­త్రి (27) సైతం మృతి చెం­దా­రు. ధా­త్రి స్వ­గ్రా­మం యద్ద­న­పూ­డి మం­డ­లం పూ­నూ­రు అయి­తే ప్ర­స్తు­తం ఇం­కొ­ల్లు మం­డ­లం పూ­స­పా­డు­లో­ని అమ్మ­మ్మ ఇం­ట్లో ఉం­టు­న్నా­రు. ధా­త్రి బెం­గు­ళూ­రు­లో సా­ఫ్ట్‌­వే­ర్‌ కం­పె­నీ­లో ఉద్యో­గం చే­స్తు­న్నా­రు. సె­ల­వు­ల­కు ధా­త్రి హై­ద­రా­బా­ద్‌­లో బం­ధు­వుల ఇం­టి­కి వె­ళ్ళి అక్కడ నుం­చి బెం­గు­ళూ­రు­కు కా­వే­రి బస్సు­లో బయలు దేరి ప్ర­మాద ఘట­న­లో మృతి చెం­దా­రు. దీం­తో గ్రా­మం­లో వి­షాధ ఛా­య­లు అల­ము­కు­న్నా­యి.

 లగే­జీ క్యా­బి­న్‌­లో మృ­త­దే­హా­లు

బస్సు లగే­జీ క్యా­బి­న్‌­లో కూడా రెం­డు మృ­త­దే­హా­లు ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు. ఇం­త­కు ఆ మృ­త­దే­హా­లు ఎవ­రి­వి..? అనే వి­ష­యం తె­లి­య­రా­లే­దు. ఈ ఘట­న­కు సం­బం­ధిం­చి పె­ద్ద వా­ద­న­లు బయ­ట­కు వస్తు­న్నా­యి. ఇం­త­కీ క్యా­బి­న్‌­లో మృ­త­దే­హా­లు ఎక్క­డి నుం­చి వచ్చా­యి. అక్ర­మం­గా ఓన­ర్‌­కి తె­లి­య­కుం­డా దొ­డ్డి­దా­రిన డబ్బు­లు తీ­సు­కు­ని ఈ ఇద్ద­రు ప్ర­యా­ణి­కు­ల­కు క్యా­బి­న్‌­లో చోటు కల్పిం­చా­రా? అనే ప్ర­శ్న లే­వ­నె­త్తు­తు­న్నా­రు. మరో­వై­పు.. ఈ ప్ర­మా­దం­పై అటు యా­జ­మా­న్యం, ఇటు డ్రై­వ­ర్, క్లీ­న­ర్‌­లు స్పం­దిం­చ­డం లేదు. తమ­కే­మి తె­లి­య­దం­టూ ముఖం చా­టే­స్తు­న్నా­రు. ఈ ప్ర­మా­దం­లో మర­ణిం­చిన వారి సం­ఖ్యం ఇంకా పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని వై­ద్యు­లు తె­లి­పా­రు. బం­ధు­వుల రో­ద­న­లు ఆ ప్రాం­త­మం­తా మా­ర్మో­గిం­ది.

Tags:    

Similar News