అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ ఆఫీసు పనులను ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండ రాయుని పాలెం వద్ద పనులు ప్రారంభించారు. 160 కోట్లతో గతంలో TDP హయాంలో ఏడంతస్తుల్లో సీఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు. YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని నిలిపేశారు.