AP : మళ్లీ మొదటికొచ్చిన యాంకర్ కావ్యకేసు

Update: 2024-10-23 12:30 GMT

ఏపీలో ఈవెంట్ మేనేజర్, యాంకర్ కావ్య కేసు సంచలనం రేపింది. రాజమండ్రిలో నమోదైన ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. వైసీపీ నాయకుడి నుంచి తనకు రావాల్సిన బాకీ 3 లక్షల రూపాయలకు అదనంగా మరో 2 లక్షలు ఇప్పించాలంటూ కావ్య తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి అడిషనల్ ఎస్పీని ఆశ్రయించింది.‌ తన డబ్బులు, నష్ట పరిహారంతో సహా ఇప్పించడం ద్వారా పోలీసులు న్యాయం చేయాలని యాంకర్ కావ్య కోరుతోంది. ఏపీ హోం మంత్రి భరోసా ఇవ్వడంతో తాను మరోసారి పోలీసులు వద్దకు వచ్చానని తెలిపింది.‌ 

Tags:    

Similar News