ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) అధ్యక్షతన జరిగిన మంగళవారం కేబినెట్ భేటీ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌరసరఫరాల శాఖ రూ.2వేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధివిధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.