భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి గుమ్మనూరు జయరాం చుట్టూ ఐటీ ఉచ్చు బిగిసుకుంటోంది. కుటుంబసభ్యుల పేరుతో కొన్న భూముల నుంచి అసలు లబ్ధి ఆయనకే కలుగుతోందని ఆదాయ పన్ను శాఖ తేల్చింది. ఇప్పటికే ఆయన భార్య రేణుకమ్మ పేరున ఉన్న 30.83 ఎకరాలను తాత్కాలికంగా అటాచ్ చేసింది ఐటీ. బంధువుల పేరిట ఉన్న మరో 90 ఎకరాలను తాజాగా అటాచ్ చేసింది. ఇక తాత్కాలికంగా అటాచ్ చేసిన 30 ఎకరాల భూమిని పూర్తిగా ఎందుకు అటాచ్ చేయరాదో ఈ నెల 17వతేదీలోగా వివరణ ఇవ్వాలంటూ.. నోటీసిలిచ్చారు ఐటీ అధికారులు. ఈ నోటీసులు గత నెల 12వ తేదీనే ఇచ్చారు. అలాగే, ఈ భూములను అన్యాక్రాంతం, బదిలీ చేయవద్దంటూ సబ్ రిజిస్ట్రార్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఐటీశాఖ లేఖలు రాసినట్లు తెలిసింది. ఏకంగా అటాచ్ చేస్తామని చెప్పడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.