AP : "గురజాల నియోజకవర్గంలో చింతలపూడి శ్రీనివాసరావు పోటీ"

Update: 2023-03-07 11:00 GMT

గురజాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన అన్న చింతలపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తారని తెలిపారు.. పల్నాడు హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో నిలబడి గెలిచి తీరుతామన్నారు. 57 పంచాయతీలకు షాదీఖానాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం మక్కాకు ఐదుగురిని పంపిస్తామని తెలిపారు.

Tags:    

Similar News