AP: అధికారికంగా ఏపీ రాజధానిగా అమరావతి

అమరావతికి అధికారిక గెజిట్ ఈ పార్లమెంట్‌ భేటీలోనే బిల్లు.. న్యాయశాఖ పరిశీలనలో ఉన్న బిల్లు.. వెల్లడించిన కేంద్రమంత్రి పెమ్మసాని

Update: 2025-11-23 05:30 GMT

అమ­రా­వ­తి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

పార్లమెంట్ బిల్లు ద్వారా గెజిట్

అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి ప్ర­క్రి­య­లో గె­జి­ట్ ప్ర­చు­రణ కీ­ల­కం కా­నుం­ది. 2014లో CRDA ఏర్పా­టు చే­సిన తర్వాత, అమ­రా­వ­తి­ని ఏకైక రా­జ­ధా­ని­గా ప్ర­తి­పా­దిం­చా­రు. కానీ 2019లో వై­సీ­పీ ప్ర­భు­త్వం ‘మూడు రా­జ­ధా­ను­లు’ వి­ధా­నా­న్ని ప్ర­వే­శ­పె­ట్టి, CRDA­ను అమ­రా­వ­తి మె­ట్రో­పా­లి­ట­న్ రీ­జి­య­న్ డె­వ­ల­ప్‌­మెం­ట్ ఏరి­యా గా మా­ర్చిం­ది. కానీ చట్ట­ప­రం­గా ని­ల­బ­డ­లే­దు. అం­దు­కే మరో­సా­రి అలాం­టి సమ­స్య­లు రా­కుం­డా గె­జి­ట్ ప్ర­చు­రిం­చే­లా చూ­డా­ల­ని రై­తు­లు కో­రు­తు­న్నా­రు. ఇన్వె­స్ట­ర్లు కో­రు­తు­న్నా­రు. గె­జి­ట్ ప్ర­చు­ర­ణ­తో రా­జ­ధా­ని­ని ఇక ఎవరూ మా­ర్చ­లే­ర­ని పె­ట్టు­బ­డి­దా­రు­లు నమ్మ­కం పెం­చు­కుం­టే పె­ట్టు­బ­డు­లు పె­రు­గు­తా­యి. నగరం వే­గం­గా వి­స్త­రి­స్తుం­ది. గె­జి­ట్ బి­ల్లు పా­ర్ల­మెం­ట్‌­లో ప్ర­వే­శ­పె­ట్ట­డం కేం­ద్ర సహ­కా­రం­పై ఆధా­ర­ప­డి ఉంది. 2020లో మూడు రా­జ­ధా­నుల చట్టా­న్ని రద్దు చే­సిన హై­కో­ర్టు ఆదే­శా­లు, సు­ప్రీం­కో­ర్టు పెం­డిం­గ్ కే­సు­లు ఇంకా పరి­ష్కా­రం కా­క­పో­వ­డం­తో, ఈ చర్య­లు రా­జ­కీ­యం­గా సు­న్ని­త­మై­న­వి­గా మా­రు­తా­యి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే...

 అన్నీ అను­కు­న్న­ట్లు­గా జరి­గి­తే వచ్చే శీ­తా­కాల సమా­వే­శా­ల­లో­నే అంటే డి­సెం­బ­ర్ లోనే అమ­రా­వ­తి­నే ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా ఖరా­రు చే­స్తూ చట్ట­ప­ర­మైన రక్షణ కలి­గే­లా గె­జి­ట్ వి­డు­దల చేసే అవ­కా­శా­లు ఉన్నా­య­ని ప్ర­భు­త్వ వర్గా­లు చె­బు­తు­న్నా­యి.  ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని అమ­రా­వ­తి­గా పా­ర్ల­మెం­ట్ లో చట్టం చే­యిం­చి, గె­జి­ట్ జారీ చే­యిం­చా­ల­న్న రై­తుల డి­మాం­డ్ కు ప్ర­భు­త్వం కూడా సా­ను­కూ­లం­గా ఉంది.  తె­లు­గు­దే­శం ప్ర­స్తు­తం కేం­ద్రం­లో కీలక పా­త్ర పో­షి­స్తూం­డ­టం­తో ఈ మే­ర­కు అమ­రా­తి గె­జి­ట్ వి­డు­దల చే­యిం­చే వి­ష­యం­లో ప్ర­భు­త్వా­ని­కి ఇబ్బం­దు­లు ఎదు­ర­య్యే అవ­కా­శం లే­ద­ని అం­టు­న్నా­రు.

 కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

అమ­రా­వ­తి రా­జ­ధా­ని వి­ష­యం­లో కీలక పరి­ణా­మా­లు చో­టు­చే­సు­కుం­టు­న్నా­యి. అమ­రా­వ­తి­ని అధి­కా­రి­కం­గా రా­ష్ట్ర రా­జ­ధా­ని­గా గు­ర్తిం­చే గె­జి­ట్ ప్ర­క్రియ ము­గిం­పు దశకు చే­రు­కు­న్న­ట్లు కేం­ద్ర మం­త్రి పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్‌ వె­ల్ల­డిం­చా­రు. త్వ­ర­లో జరి­గే పా­ర్ల­మెం­ట్ సమా­వే­శా­ల్లో అమ­రా­వ­తి రా­జ­ధా­ని బి­ల్లు ప్ర­వే­శ­పె­ట్టే అవ­కా­శం ఉన్న­ట్లు ఆయన తె­లి­పా­రు. గతం­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు కేం­ద్ర హోం మం­త్రి అమి­త్ షాతో రా­జ­ధా­ని వి­ష­యం చర్చిం­చి­న­ట్లు గు­ర్తు­చే­శా­రు. ప్ర­స్తు­తం హోం శా­ఖ­లో ఫైల్ క్లి­య­ర్ అయి, న్యా­య­శాఖ పరి­శీ­ల­న­లో ఉన్న­ట్లు సమా­చా­రం. ఇక, రా­జ­ధా­ని ని­ర్మా­ణం­లో భా­గం­గా రై­తు­ల­కు భూ­వి­ని­మయ ఒప్పం­దం­లో 98 శాతం ప్లా­ట్ల పం­పి­ణీ పూ­ర్తై­న­ట్లు కేం­ద్ర మం­త్రి పే­ర్కొ­న్నా­రు. మి­గి­లిన 2 శాతం సమ­స్య­లు కూడా త్వ­ర­లో పరి­ష్కా­రం కా­ను­న్నా­య­ని తె­లి­పా­రు. అమ­రా­వ­తి­ని రా­ష్ట్ర రా­జ­ధా­ని­గా శా­శ్వ­తం­గా ప్ర­క­టిం­చేం­దు­కు పా­ర్ల­మెం­ట్ సా­క్షి­గా బి­ల్లు తీ­సు­కొ­చ్చే ఆలో­చన ఉన్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. దీ­ని­తో అమ­రా­వ­తి రా­జ­ధా­ని వి­ష­యం­లో ఓపె­న్ ఎం­డిం­గ్ లే­కుం­డా శా­స­న­ప­రం­గా పూ­ర్తి ని­ర్ధా­రణ కలి­గే అవ­కా­శం ఉం­ద­ని అధి­కార వర్గా­లు చె­బు­తు­న్నా­యి. అయి­తే, అమ­రా­వ­తి గె­జి­ట్‌­పై త్వ­ర­లో­నే పూ­ర్తి స్ప­ష్టత వచ్చే అవ­కా­శం ఉం­డ­టం­తో, రా­జ­ధా­ని ప్రాం­తం­లో తి­రి­గి కా­ర్య­క­లా­పా­లు వేగం పుం­జు­కు­నే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. అమ­రా­వ­తి గె­జి­ట్ అంశం వి­వా­దా­స్ప­దం­గా­నే ఉంది. మొ­ద­టి ఐదే­ళ్లు గె­జి­ట్ తీ­సు­కు­రా­లే­ద­ని గోల చే­శా­రు. ఏ రా­ష్ట్రా­ని­కి గె­జి­ట్ ఉం­డ­దు.

Tags:    

Similar News