AP: సాంస్కృతిక వారసత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రతీక

కొనియాడిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్... తిరుపతిలో మహిళా సాధికార జాతీయ సదస్సు... మహిళలే సమాజ అర్కిటెక్ట్‌లు: గవర్నర్

Update: 2025-09-16 04:30 GMT

సాం­స్కృ­తిక వా­ర­స­త్వా­ని­కి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ఓ ప్ర­తీక అని రా­జ్య­సభ డి­ప్యూ­టీ ఛై­ర్మ­న్‌ హరి­వం­శ్‌ నా­రా­య­ణ్‌ సిం­గ్‌ అన్నా­రు. తి­రు­ప­తి వే­ది­క­గా ‘మహి­ళా సా­ధి­కార జా­తీయ సద­స్సు’ ము­గిం­పు కా­ర్య­క్ర­మం­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. రా­ష్ట్రా­ని­కి చెం­దిన స్వా­తం­త్ర్య సమ­ర­యో­ధు­రా­లు దు­ర్గా­భా­య్‌ దే­శ్‌­ము­ఖ్‌ సే­వ­ల­ను హరి­వం­శ్‌ కొ­ని­యా­డా­రు. తరచూ మహి­ళా సా­ధి­కార సమా­వే­శా­లు ఏర్పా­టు చే­యా­ల­ని ఆకాం­క్షిం­చా­రు. ఈ సమా­వే­శం­లో అర్థ­వం­త­మైన చర్చ­లు ని­ర్వ­హిం­చా­మ­న్నా­రు. మహి­ళల సమ­స్య­లే కాదు వా­టి­కి పరి­ష్కార మా­ర్గా­ల­ను సూ­చిం­చా­ర­ని చె­ప్పా­రు.


మహిళలే సరైన ఆర్కిటెక్ట్‌లు

మహి­ళా సా­ధి­కా­రత కే­వ­లం మహి­ళ­ల­నే కాదు.. సమా­జా­న్నీ వృ­ద్ధి పథం­లో నడి­పి­స్తుం­ద­ని ఏపీ గవ­ర్న­ర్‌ జస్టి­స్‌ అబ్దు­ల్‌ నజీ­ర్‌ అన్నా­రు. తి­రు­ప­తి­లో ని­ర్వ­హి­స్తు­న్న మహి­ళా సా­ధి­కార కమి­టీల జా­తీయ సద­స్సు రెం­డో­రో­జు కా­ర్య­క్ర­మా­ని­కి ఆయన ము­ఖ్య అతి­థి­గా హా­జ­రై మా­ట్లా­డా­రు. సతీ సహ­గ­మ­నం, బా­ల్య వి­వా­హా­లు పు­రా­ణా­ల్లో కని­పిం­చ­వ­ని చె­ప్పా­రు. మన వే­దా­లు, ఉప­ని­ష­త్తు­లు మహి­ళ­ల­ను గౌ­ర­విం­చా­ల­ని చె­బు­తు­న్నా­య­న్నా­రు. వా­రి­కి గౌ­ర­వం లేని చోట ఎన్ని గొ­ప్ప కా­ర్య­క్ర­మా­లు చే­సి­నా ఫలి­తం లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. మహి­ళ­లు ఎన్నో సవా­ళ్ల­ను దాటి రా­జ­కీయ, ఉద్యోగ, వ్యా­పార రం­గా­ల్లో పు­రు­షు­ల­కు గట్టి పోటీ ఇస్తు­న్నా­రు. సు­ప్రీం­కో­ర్టు అనేక తీ­ర్పు­ల్లో వారి హక్కు­ల­ను కా­పా­డే­లా తీ­ర్పు­లు ఇచ్చిం­ది. ఆయా తీ­ర్పు­లు హక్కు­ల­ను కా­పా­డ­టం­లో­నే కాదు, సమాజ ని­ర్మా­ణం­లో­నూ కీలక పా­త్ర పో­షిం­చా­యి. ఛత్తీ­స్‌­గ­ఢ్‌­లో అత్య­ధి­కం­గా 14 శాతం మంది మహి­ళా ఎమ్మె­ల్యే­లు ఉన్నా­రు. రు­వాం­డా­లో 30 శాతం పా­ర్ల­మెం­ట­రీ సీ­ట్లు కే­టా­యి­స్తూ చట్టం చే­సిన కొ­ద్ది కా­లా­ని­కే అక్కడ వృ­ద్ధి పె­రి­గిం­ది. ’’ అని గవ­ర్న­ర్‌ అన్నా­రు.

Tags:    

Similar News