AP: ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఆంధ్రప్రదేశ్‌ కీలకం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు.. ఏపీకి పటిష్ట నాయకత్వం ఉందన్న ప్రధాని.. రాష్ట్రంలో అనంతమైన అవకాశాలున్నాయ్

Update: 2025-10-17 02:00 GMT

ఆత్మ­గౌ­ర­వం, సం­స్కృ­తి­కి ని­ల­యం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ఉం­ద­ని ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ అన్నా­రు. కర్నూ­లు శి­వా­రు­లో­ని నన్నూ­రు వద్ద ‘సూ­ప­ర్‌ జీ­ఎ­స్టీ- సూ­ప­ర్‌ సే­విం­గ్స్‌’ పే­రు­తో ఏర్పా­టు చే­సిన బహి­రం­గ­స­భ­కు గవ­ర్న­ర్‌ జస్టి­స్‌ అబ్దు­ల్‌ నజీ­ర్‌, సీఎం చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్, ఐటీ మం­త్రి నారా లో­కే­శ్‌ తది­త­రు­లు హా­జ­ర­య్యా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా పలు­చో­ట్ల ని­ర్మిం­చిన, ని­ర్మిం­చ­బో­తు­న్న రూ.13,429 కో­ట్ల వి­లు­వైన ప్రా­జె­క్టు­ల­కు ప్ర­ధా­ని నరేం­ద్ర­మో­దీ వర్చు­వ­ల్‌­గా ప్రా­రం­భో­త్స­వా­లు, శం­కు­స్థా­ప­న­లు చే­శా­రు. ‘‘సై­న్స్‌, ఆవి­ష్క­ర­ణల కేం­ద్రం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ఉంది. ఏపీ­లో అనంత అవ­కా­శా­ల­తో పాటు యు­వ­త­కు అపార శక్తి ఉంది. అహో­బి­లం నర్సిం­హ­స్వా­మి, మహా­నం­ది ఈశ్వ­రు­డి­కి నమ­స్క­రి­స్తు­న్నా. మం­త్రా­ల­యం రా­ఘ­వేం­ద్ర­స్వా­మి అం­ద­రి­నీ ఆశీ­ర్వ­దిం­చా­ల­ని కో­రు­తు­న్నా. జ్యో­తి­ర్లిం­గం సో­మ­నా­థు­డి నేల అయిన గు­జ­రా­త్‌­లో నేను జన్మిం­చా­ను. వి­శ్వ­నా­థు­డి భూమి అయిన కా­శీ­కి సేవ చేసే అవ­కా­శం లభిం­చిం­ది. చం­ద్ర­బా­బు, పవ­న్‌ రూ­పం­లో ఏపీ­కి శక్తి­మం­త­మైన నా­య­క­త్వం ఉంది. ఏపీ­కి కేం­ద్ర ప్ర­భు­త్వం పూ­ర్తి మద్ద­తు ఉంది. 16 నె­ల­లు­గా రా­ష్ట్రం­లో అభి­వృ­ద్ధి శర­వే­గం­గా జరు­గు­తోం­ది. డబు­ల్‌ ఇం­జి­న్‌ సర్కా­రు ఆధ్వ­ర్యం­లో రా­ష్ట్రం అపూ­ర్వ ప్ర­గ­తి సా­ధి­స్తోం­ది. ది­ల్లీ, అమ­రా­వ­తి వే­గం­గా అభి­వృ­ద్ధి పథం­లో సా­గు­తు­న్నా­యి. 2047 నా­టి­కి మన దేశం.. వి­క­సి­త్‌ భా­ర­త్‌­గా మా­రు­తుం­ది. 21వ శతా­బ్దం.. 140 కో­ట్ల భా­ర­తీ­యుల శతా­బ్దం’’ అని మోదీ అన్నా­రు.

వికసిత్ భారత్ దిశగా...

శ్రీ­కా­కు­ళం నుం­చి అం­గు­ల్‌ వరకు గ్యా­స్‌ పై­ప్‌­లై­న్‌.. వి­క­సి­త్‌ భా­ర­త్‌ లక్ష్యా­న్ని సా­ధిం­చేం­దు­కు కనె­క్టి­వి­టీ­పై ఫో­క­స్‌ పె­ట్టాం అన్నా­రు ప్ర­ధా­ని మోడీ… 2047 వి­క­సి­త్‌ భా­ర­త్‌ సం­క­ల్పా­ని­కి స్వ­ర్ణాం­ధ్ర ఎంతో సహ­క­రి­స్తోం­ది.. రెం­డ్రో­జుల క్రి­తం ఏపీ­లో గూ­గు­ల్‌ పె­ట్టు­బ­డి ప్ర­క­టిం­చిం­ది.. గూ­గు­ల్‌ ఏఐ హబ్‌­తో వి­శాఖ అం­త­ర్జా­తీయ కే­బు­ల్‌ హబ్‌­గా మా­ర­బో­తోం­ది.. దే­శా­భి­వృ­ద్ధి­కి ఏపీ అభి­వృ­ద్ధి అవ­స­రం.. అలా­గే ఏపీ అభి­వృ­ద్ధి­కి రా­య­ల­సీమ అభి­వృ­ద్ధి కూడా అవ­స­రం అన్నా­రు.. ని­మ్మ­లూ­రు నై­ట్‌ వి­జ­న్‌ పరి­క­రాల తయా­రీ ఫ్యా­క్ట­రీ ఏర్పా­టు చే­స్తు­న్నాం. కర్నూ­ల్‌­ను డ్రో­న్‌ హబ్‌­గా మా­ర్చా­ల­న్న­ది రా­ష్ట్ర ప్ర­భు­త్వం సం­క­ల్పం అని తె­లి­పా­రు.. ఆప­రే­ష­న్‌ సిం­దూ­ర్‌­లో మన డ్రో­న్లు అద్భు­తా­లు సృ­ష్టిం­చా­య­న్నా­రు.. దే­శం­లో రూ.12 లక్షల ఆదా­యం ఉన్న­వా­రి­కి పన్ను లే­కుం­డా చే­శాం.. జీ­ఎ­స్టీ భారం తగ్గిం­చాం అని ప్ర­ధా­ని మోదీ అన్నా­రు. కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వా­లు ఏపీ సా­మ­ర్థ్యా­న్ని వి­స్మ­రిం­చా­యి. దే­శా­న్ని ముం­దు­కు నడి­పిం­చే శక్తి ఏపీ­కి ఉంది. ఎన్‌­డీఏ హయాం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ­చి­త్రం మా­రు­తోం­ది’’ అని ప్ర­ధా­ని అన్నా­రు.

శ్రీశైల మల్లన్న సేవలో నరేంద్రుడు


ఉమ్మ­డి కర్నూ­లు జి­ల్లా పర్య­ట­న­లో భా­గం­గా ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ శ్రీ­శై­లం క్షే­త్రా­ని­కి చే­రు­కు­ని భ్ర­మ­రాంబ, మల్లి­కా­ర్జున స్వా­మి­వా­రి­ని దర్శిం­చు­కు­న్నా­రు. మల్లి­కా­ర్జు­న­స్వా­మి­కి పం­చా­మృ­తా­ల­లో రు­ద్రా­భి­షే­కం చే­శా­రు. భ్ర­మ­రాం­బా­దే­వి­కి ఖడ్గ­మాల సమ­ర్పిం­చా­రు. కుం­కు­మా­ర్చన పూ­జ­లు చే­శా­రు. అనం­త­రం శి­వా­జీ స్ఫూ­ర్తి కేం­ద్రా­న్ని సం­ద­ర్శిం­చా­రు. మల్లి­కా­ర్జు­న­స్వా­మి ఆల­యం­లో మోడీ రు­ద్రా­భి­షే­కం చే­య­గా, భ్ర­మ­రాంబ అమ్మ­వా­రి ఆల­యం­లో కుం­కు­మా­ర్చన పూజ చే­శా­రు. ప్ర­ధా­ని­తో పాటు కర్నూ­లు నుం­డి చం­ద్ర­బా­బు, పవన్ కల్యా­ణ్ ఒకే హె­లి­కా­ప్ట­ర్‌­లో శ్రీ­శై­లం వె­ళ్లా­రు. సు­న్ని­పెంట హె­లి­ప్యా­డ్ వద్ద హె­లి­కా­ప్ట­ర్ ల్యాం­డ్ అవ్వ­డ­గా అక్కడ నుం­డి రో­డ్డు మా­ర్గం­లో శ్రీ­శై­లం చే­రు­కు­న్నా­రు.



Tags:    

Similar News