AP: ఏపీలోని దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Update: 2025-09-19 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో­ని ప్ర­ధాన దే­వా­ల­యా­ల­కు ఛై­ర్మ­న్ల­ను ని­య­మి­స్తూ రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. శ్రీ­శై­లం మల్ల­న్న ఆలయ ఛై­ర్మ­న్‌­గా రమే­ష్‌ నా­యు­డు, వా­డ­ప­ల్లి వెం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆలయ ఛై­ర్మ­న్‌­గా వెం­క­ట్రా­జు, కా­ణి­పా­కం వర­సి­ద్ధి వి­నా­య­క­స్వా­మి ఆలయ ఛై­ర్మ­న్‌­గా సు­రేం­ద్ర­బా­బు, శ్రీ­కా­ళ­హ­స్తి ఆలయ ఛై­ర్మ­న్‌­గా కొ­ట్టె సా­యి­ప్ర­సా­ద్‌, వి­జ­య­వాడ దు­ర్గా­మ­ల్లే­శ్వ­ర­స్వా­మి ఆలయ ఛై­ర్మ­న్‌­గా రా­ధా­కృ­ష్ణ ని­య­మి­తు­ల­య్యా­రు. ఎన్డీ­యే ప్ర­భు­త్వం పద­వుల భర్తీ వే­గం­గా చే­ప­డు­తోం­ది. తె­లు­గు­దే­శం పా­ర్టీ, జన­సేన, బీ­జే­పీ­లు కూ­ట­మి­గా ఏర్ప­డ­గా.. అధి­కా­రం­లో­కి వచ్చాక అన్ని పా­ర్టీ­ల­ను సమ­న్వ­యం చే­సు­కుం­టూ ఏపీ ప్ర­భు­త్వ అత్యు­న్నత పద­వుల నుం­చి క్షే­త్ర­స్థా­యి పద­వుల వరకు అన్నిం­టి­ని చకా­చ­కా భర్తీ చే­స్తోం­ది. పా­ర్టీ కోసం కష్ట­ప­డిన నా­మి­నే­టె­డ్ పో­స్టు­ల్లో ప్రా­ధా­న్యం ఇస్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ఇప్ప­టి­కే స్ప­ష్టం చే­శా­రు.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తి­రు­మల శ్రీ­వా­రి బ్ర­హ్మో­త్స­వా­ల­కు భద్ర­తా ఏర్పా­ట్లు పూ­ర్త­య్యా­య­ని తి­రు­ప­తి ఎస్పీ సు­బ్బా­రా­యు­డు తె­లి­పా­రు. గత బ్ర­హ్మో­త్స­వా­ల్లో లో­పా­ల­ను గు­ర్తిం­చి ప్ర­త్యే­క­మైన భద్ర­తా చర్య­లు చే­ప్ట­టా­మ­ని చె­ప్పా­రు. భక్తు­ల­కు ఇబ్బం­దు­లు కల­గ­కుం­డా పా­ర్కిం­గ్‌ స్థ­లా­లు ఏర్పా­టు చే­శా­మ­న్నా­రు. భక్తు­ల­కు అన్న­ప్ర­సా­దా­లు, తాగు నీరు వం­టి­వి పం­పి­ణీ చే­స్తా­మ­న్నా­రు. సె­ప్టెం­బ­ర్‌ 24 నుం­చి అక్టో­బ­ర్ 2 వరకు బ్ర­హ్మో­త్స­వా­లు జర­గ­ను­న్నా­యి. స్వా­మి­వా­రి దర్శ­నం కోసం వేచి ఉండే భక్తు­ల­కు ని­రం­త­రం అన్న­ప్ర­సా­దా­లు, తాగు నీరు వం­టి­వి పం­పి­ణీ చే­స్తు­న్న­ట్లు ఆయన తె­లి­పా­రు. గరుడ సేవ రోజు తి­రు­మల కనుమ రహ­దా­రు­ల్లో ద్వి­చ­క్ర­వా­హ­నాల రా­క­పో­క­ల­పై ఆం­క్ష­లు వి­ధిం­చా­మ­ని, తి­రు­మల వచ్చే భక్తు­లు ఆర్టీ­సీ బస్సుల ద్వా­రా రా­వా­ల­ని కో­రా­రు. 5 ప్రాం­తా­ల­లో పా­ర్కిం­గ్‍ స్థ­లా­లు ఏర్పా­టు చే­స్తు­న్న­ట్లు ఆయన తె­లి­పా­రు. 4 వేల సీసీ కె­మె­రాల ద్వా­రా బ్ర­హ్మో­త్స­వా­ల­ను పర్య­వే­క్షి­స్తా­మ­న్నా­రు.

Tags:    

Similar News