AP ASSEMBLY: సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సె­ప్టెం­బ­రు 14, 15 తే­దీ­ల్లో మహి­ళా ఎమ్మె­ల్యే­ల­కు ప్ర­త్యేక సమా­వే­శం

Update: 2025-09-01 06:00 GMT

సె­ప్టెం­బ­ర్ 18 నుం­చి 10 రో­జు­ల­పా­టు అసెం­బ్లీ సమా­వే­శా­లు ని­ర్వ­హిం­చే యో­చ­న­లో కూ­ట­మి ప్ర­భు­త్వం ఉన్న­ట్టు తె­లు­స్తోం­ది. సె­ప్టెం­బ­ర్ 4న జరి­గే కే­బి­నె­ట్ భే­టీ­లో అసెం­బ్లీ సమా­వే­శాల షె­డ్యూ­ల్ ఖరా­ర­య్యే అవ­కా­శం ఉంది. ఈ వి­ష­యా­న్నీ గత నె­ల­ల­లో స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు వె­ల్ల­డిం­చా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ఏడా­ది పాలన, తాజా రా­జ­కీయ పరి­ణా­మా­లు, ప్ర­భు­త్వ పథ­కాల అమ­లు­పై కూడా అసెం­బ్లీ­లో చర్చిం­చ­ను­న్నా­రు. తి­రు­ప­తి­లో సె­ప్టెం­బ­రు 14, 15 తే­దీ­ల్లో మహి­ళా ఎమ్మె­ల్యే­ల­కు ప్ర­త్యేక సమా­వే­శా­న్ని ఏర్పా­టు చే­స్తు­న్న­ట్టు ఏపీ శా­స­న­సభ స్పీ­క­ర్‌ అయ్య­న్న­పా­త్రు­డు తె­లి­పా­రు. . దే­శం­లో­ని అన్ని రా­ష్ట్రాల పరి­ధి­లో ఉన్న వి­విధ పా­ర్టీ­ల­కు చెం­దిన సు­మా­రు 300 మంది మహి­ళా ఎమ్మె­ల్యే­లు సద­స్సు­కు హా­జ­రు కా­ను­న్న­ట్టు చె­ప్పా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి తొ­లి­రో­జు సీఎం చం­ద్ర­బా­బు, లో­క్‌­సభ స్పీ­క­ర్‌ హా­జ­ర­వు­తా­ర­ని, ము­గిం­పు రో­జున గవ­ర్న­ర్‌ హా­జ­రు­కా­ను­న్నా­ర­ని ఏపీ స్పీ­క­ర్‌ అయ్య­న్న­పా­త్రు­డు తె­లి­పా­రు. సద­స్సు­కు హా­జ­ర­య్యే ఎమ్మె­ల్యే­ల­కు శ్రీ­వా­రి దర్శ­నం కల్పిం­చిం­చేం­దు­కు ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­మ­న్నా­రు. సె­ప్టెం­బ­రు 18 నుం­చి శా­స­న­సభ సమా­వే­శా­లు జర­గు­తా­య­ని, ఎమ్మె­ల్యే­ల­కు సమా­చా­రం పం­పిం­చి­న­ట్టు పే­ర్కొ­న్నా­రు. ఈసా­రి ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­స­భా సమా­వే­శా­ల­కు వై­సీ­పీ హా­జ­ర­వు­తుం­దా లేదా అన్న­ది ప్ర­శ్నా­ర్థ­కం­గా మా­రిం­ది. వై­సీ­పీ అధి­నేత జగన్ ఈసా­రి కూడా అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­రు కా­న­ట్లు తె­లు­స్తోం­ది.

35 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్

ఇటీ­వల జరి­గిన ప్ర­జా ప్ర­తి­ని­ధుల సమా­వే­శం­లో సీఎం చం­ద్ర­బా­బు..35 మంది ఎమ్మె­ల్యే­ల­కు గట్టి­గా వా­ర్నిం­గ్ ఇచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. కొ­త్త­గా ఎన్ని­కైన ఎమ్మె­ల్యే­ల­‌­తో­నే స‌­మ­‌­స్య వ‌­స్తోం­ద­‌­ని, పా­త­‌­వా­ళ్లు ని­బం­ధ­‌­న­‌­ల­‌­కు అను­గు­ణం­గా వ్య­వ­‌­హ­‌­రి­స్తు­న్నా­ర­‌­ని అన్నా­రు. ఇప్ప­టి వ‌­ర­‌­కు 35 మంది ఎమ్మె­ల్యే­ల­‌­ను పి­లి­పిం­చు­కు­ని, గ‌­ట్టి­గా వా­ర్నిం­గ్ ఇచ్చా­న­‌­ని చె­ప్పా­రు. మా­ర్పు రా­క­‌­పో­తే, క‌­ఠిన చ‌­ర్య­లు తప్ప­వ­ని స్ట్రాం­గ్ వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. ఇచ్చిన హా­మీ­ల­ను ఒక్కొ­క్క­టి­గా అమలు చే­స్తూ ఏపీ­లో­ని కూ­ట­మి ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ది. హా­మీ­ల­ను ఒక్కొ­క్క­టి­గా నె­ర­‌­వే­రు­స్తు­న్నా ఎమ్మె­ల్యేల తీ­రు­తో వ్య­తి­రే­క­‌త రా­వ­డం టీ­డీ­పీ­ను ఆం­దో­ళన పరు­స్తోం­ది. వ్య­తి­రే­క­త­కు కా­ర­ణా­ల­ను తె­లు­గు­దే­శం అధి­ష్టా­నం తె­లు­సు­కుం­టోం­ది. ఏడా­ది పా­ల­‌­న­లో­నే ఇంత పె­ద్ద సం­ఖ్య­లో ఎమ్మె­ల్యే­లు ఆరో­ప­‌­ణ­‌­లు ఎదు­ర్కొం­టుం­డ­డం­తో టీ­డీ­పీ అం­త­ర్మ­థ­నం­లో పడిం­ద­ని రా­జ­కీయ ని­పు­ణు­లు భా­వి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News