AP: ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల

600 కో­ట్ల రూ­పా­య­ల­ను విడుదల చేసిన ఏపీ ప్ర­భు­త్వం;

Update: 2025-07-13 04:30 GMT

ఫీజు రి­యం­బ­ర్స్ మెం­ట్ కోసం600 కో­ట్ల రూ­పా­య­ల­ను ఏపీ ప్ర­భు­త్వం వి­డు­దల చే­సిం­ది. 2024-25 ఏడా­ది­కి అద­న­పు మొ­త్తం వి­డు­దల చే­శా­మ­ని ఉన్నత వి­ద్యా­శాఖ అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఇప్ప­టి­కే మొ­ద­టి వి­డ­త­గా ఫీజు రి­యం­బ­ర్స్ మెం­ట్ కు సు­మా­రు రూ. 788 కో­ట్లు చె­ల్లిం­చా­మ­ని సర్కా­ర్ పే­ర్కొ­న్నా­రు. త్వ­ర­లో మరో రూ. 400 కో­ట్లు వి­డు­దల చే­స్తా­మ­ని వి­ద్యా­శాఖ కా­ర్య­ద­ర్శి కోన శశి­ధ­ర్ తె­లి­పా­రు. ఇక, దశల వా­రీ­గా బకా­యి­ల­న్నీ చె­ల్లి­స్తా­మ­ని వి­ద్యా సం­స్థ­ల­కు ప్ర­భు­త్వం స్ప­ష్టం చే­సిం­ది. ఫీ­జు­లు చె­ల్లిం­చా­ల­ని వి­ద్యా­ర్థు­ల­పై ఒత్తి­డి చే­యొ­ద్ద­ని వె­ల్ల­డిం­చిం­ది. వి­ద్యా­ర్థు­ల­ను ఇబ్బం­ది పె­డి­తే కా­లే­జీ­ల­పై కఠిన చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని హె­చ్చ­రిం­చిం­ది. ఫీజు రి­యం­బ­ర్స్‌­మెం­ట్ ని­ధు­లు వి­డు­దల చే­య­డం­పై అటు కళా­శా­ల­లు, ఇటు వి­ద్యా­ర్థు­లు హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

చంద్రబాబు ఢిల్లీ టూర్

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు రెం­డు రో­జుల పాటు ఢి­ల్లీ­లో పర్య­టిం­చ­ను­న్నా­రు. ఈ నెల 15,16వ తే­దీ­ల్లో దేశ రా­జ­ధా­ని ఢి­ల్లీ­లో పలు­వు­రు కేం­ద్ర మం­త్రు­ల­తో భేటీ సహా  వే­ర్వే­రు కా­ర్య­క్ర­మా­ల­కు ము­ఖ్య­మం­త్రి హా­జ­రు­కా­ను­న్నా­రు. రా­ష్ట్రం­లో చే­ప­డు­తో­న్న వి­విధ ప్రా­జె­క్టు­లు, కేం­ద్ర గ్రాం­ట్ల­పై సీఎం వా­రి­తో చర్చిం­చ­ను­న్నా­రు. కేం­ద్ర హోం మం­త్రి అమి­త్ షా, ఆర్ధిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, మం­త్రు­లు అశ్వి­నీ వై­ష్ణ­వ్, సీ­ఆ­ర్ పా­టి­ల్, మన్సు­ఖ్ మాం­డ­వీయ, నీతి ఆయో­గ్ సభ్యు­డు వీకే సా­ర­స్వ­త్ తది­త­రు­ల­తో సీఎం న ఢి­ల్లీ పర్య­ట­న­లో భేటీ కా­ను­న్నా­రు.   రా­ష్ట్రం­లో చే­ప­ట్టిన ప్రా­జె­క్టు­లు, వా­టి­కి అవ­స­ర­మైన ని­ధు­లు,  పో­ల­వ­రం- బన­క­చ­ర్ల అను­సం­ధాన ప్రా­జె­క్టు సహా వే­ర్వే­రు అం­శా­ల­పై సీఎం కేం­ద్ర మం­త్రు­ల­తో చర్చిం­చ­ను­న్నా­రు. అలా­గే గ్రా­మీణ ఉపా­ధి హామీ పథకం పను­ల­కు సం­బం­ధిం­చిన పనుల గు­రిం­చి కూడా ఆయా మం­త్రి­త్వ శా­ఖ­తో సీఎం చర్చ­లు జరు­ప­ను­న్నా­రు. 15వ తేదీ ఉదయం అమ­రా­వ­తి నుం­చి ఢి­ల్లీ వె­ళ్ల­ను­న్న ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు మధ్యా­హ్నం కేం­ద్ర హోం­మం­త్రి అమి­త్ షాతో భేటీ కా­ను­న్నా­రు. అదే రోజు కేం­ద్ర ఐటీ శాఖ మం­త్రి అశ్వి­నీ వై­ష్ణ­వ్, ఢి­ల్లీ మె­ట్రో రైల్ ఎం­డీ­ల­తో­నూ చం­ద్ర­బా­బు సమా­వే­శం కా­ను­న్నా­రు.      

Tags:    

Similar News