గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రి రజనీ, ఎంపీ అవినాష్రెడ్డి, అవినాష్రెడ్డి మామా ప్రతాప్రెడ్డి, అవినాష్రెడ్డి మరదలు శ్వేతారెడ్డి, జీవీ దినేష్రెడ్డి, శివపార్వతులకు నోటీసులు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండా ఎన్వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి హైకోర్టు... మొత్తం 21 ఎకరాల 50 సెంట్ల భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇచ్చి, ఎమ్మార్వోకు కూడా నోటీసులిచ్చింది. రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక్క ఎకరాలో 200 కోట్ల విలువైన గ్రానైట్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. రైతులకు తెలియకుండా ఎన్వోసీ ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల10కి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. అటు... కౌంటర్లు దాఖలు చేయాలంటూ మంత్రి రజనీతో పాటు ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.