సరస్వతి పవర్ ఇండస్ట్రీస్పై ఏపీ హైకోర్టు విచారణ
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీ రఘురామ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.;
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీ రఘురామ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తమ వైపు నుంచి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామ పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కు మైనింగ్ లీజు, నీటి సరఫరా అనుమతి రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. సీబీఐ కేసుల్ని కోర్టుకు తెలపకుండా అనుమతులు తీసుకున్నారని రఘురామ వెల్లడించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి.... విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.