AP High Court : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

AP High Court : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..

Update: 2021-07-15 10:45 GMT

Ap High court (File photo)

AP High Court : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఆగస్టు ఒకటో తేదీ లోపు నరేగా బకాయిలు చెల్లించాలని.. అలా చెల్లించని పక్షంలో ఆగస్టు ఒకటిన అధికారులు కోర్టుకు హాజరైన సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.. నరేగా నిధులపై చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని బెంచ్‌ విచారణ చేపట్టింది.. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌.. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది ధర్మాసనం.

Tags:    

Similar News