AP: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు

దిగ్విజయమైన విశాఖ పెట్టుబడుల సదస్సు

Update: 2025-11-16 02:30 GMT

వి­శా­ఖ­లో జరు­గు­తు­న్న సీఐఐ సద­స్సు­లో ఇప్ప­టి వరకూ రూ.13 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వచ్చా­య­ని సీఎం చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. మూడు రో­జు­ల్లో 613 ఒప్పం­దా­లు.. 12 రం­గా­ల్లో రూ.13.26 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు.. 16.31 లక్షల మం­ది­కి ఉద్యో­గా­వ­కా­శా­లు.. ఇవ­న్నీ వి­శా­ఖ­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్వ­హిం­చిన సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు ఫలా­లు. జా­తీయ, అం­త­ర్జా­తీయ పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు, వి­విధ రం­గాల ప్ర­తి­ని­ధు­లు తర­లి­వ­చ్చి రా­ష్ట్రం­లో ఉన్న అవ­కా­శా­ల­ను అర్థం చే­సు­కు­న్నా­రు. పరి­శ్ర­మ­ల­కు రె­డ్‌­కా­ర్పె­ట్‌ పరు­స్తు­న్న ప్ర­భు­త్వ వి­ధా­నా­ల­పై నమ్మ­కం ఉం­చా­రు. రూ.లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఒప్పం­దా­ల­పై సం­త­కా­లు చే­శా­రు. 14, 15 తే­దీ­ల్లో భా­గ­స్వా­మ్య సద­స్సు అని ప్ర­క­టిం­చి­నా.. ఒక­రో­జు ముం­దే నగ­రం­లో పె­ట్టు­బ­డుల సం­ద­డి మొ­ద­లైం­ది. జా­తీయ, అం­త­ర్జా­తీయ పా­రి­శ్రా­మిక ప్ర­తి­ని­ధు­ల­తో వి­శా­ఖ­లో ఓ మినీ ప్ర­పం­చ­పు సం­ద­డి కని­పిం­చిం­ది. 16 నెలల కిం­ద­టి వరకు ఏపీ అం­టే­నే వణి­కి­పో­యి, రా­ష్ట్రా­న్ని వది­లి­పో­యిన పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు సైతం ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు మళ్లీ బా­రు­లు తీ­రా­రు. గూ­గు­ల్‌ డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు తర్వాత.. తామూ అదే రం­గం­లో పె­ట్టు­బ­డు­ల­కు సి­ద్ధ­మం­టూ ప్ర­ముఖ సం­స్థ­లు వి­శాఖ తలు­పు­త­ట్టా­యి. రి­ల­య­న్స్, బ్రూ­క్‌­ఫీ­ల్డ్‌ సం­స్థ­లు 1,000 మె­గా­వా­ట్ల చొ­ప్పున డేటా సెం­ట­ర్ల ఏర్పా­టు­కు వే­ర్వే­రు­గా ఒప్పం­దా­లు కు­దు­ర్చు­కు­న్నా­యి. పె­ద్ద­పె­ద్ద సం­స్థ­లే కాదు, వై­కా­పా ప్ర­భు­త్వ వే­ధిం­పు­ల­కు బలై­న­వా­రు, పా­రి­శ్రా­మిక ప్రో­త్సా­హ­కా­ల­కు నో­చు­కోక ఇబ్బం­దు­లు పడిన వారూ కొ­త్త పె­ట్టు­బ­డు­ల­కు ఉత్సా­హం­తో ముం­దు­కొ­చ్చా­రు. పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల్లో వి­శ్వా­సం నిం­పేం­దు­కు.. చం­ద్ర­బా­బు కీలక ని­ర్ణ­యా­లు ప్ర­క­టిం­చా­రు. వచ్చే ఏడా­ది మళ్లీ నవం­బ­రు 14, 15 తే­దీ­ల్లో వి­శా­ఖ­ప­ట్నం­లో­నే సద­స్సు ని­ర్వ­హి­స్తా­మ­ని, దీ­ని­కో­సం ప్ర­త్యే­కం­గా వి­శాఖ తీ­రాన ‘ఆం­ధ్ర మం­డ­పం’ ఏర్పా­టు చే­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు ప్రా­రం­భా­ని­కి ముం­దే ఏపీ ప్ర­భు­త్వం పలు సం­స్థ­ల­తో ఒప్పం­దా­లు చే­సు­కుం­ది. గు­రు­వా­రం ఒక్క రోజే 35 సం­స్థ­ల­తో ఒప్పం­దా­లు కు­దు­ర్చు­కుం­ది.

భా­గ­స్వా­మ్య సద­స్సు­లో చే­సు­కు­న్న రూ.13.25 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డుల ఒప్పం­దా­ల­ను మూ­డు­న్న­రే­ళ్ల­లో ఆచ­ర­ణ­లో­కి తె­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ‘‘ఈసా­రి అన్ని జా­గ్ర­త్త­లూ తీ­సు­కు­న్నాం. పె­ట్టు­బ­డి­దా­రు­ల­తో ముం­దే అన్నీ మా­ట్లా­డాం. ని­బ­ద్ధత ఉన్న­వా­రి­తో­నే ఒప్పం­దా­ల­పై సం­త­కా­లు చే­శాం. వా­రి­లో ఎవ­రి­కై­నా అను­కో­ని ఆర్థిక ఇబ్బం­దు­లు వస్తే తప్ప.. మొ­త్తం ప్ర­తి­పా­ద­న­ల­న్నీ ఆచ­ర­ణ­లో­కి వస్తా­యి’’ అని ఆయన పే­ర్కొ­న్నా­రు. శని­వా­రం పె­ట్టు­బ­డి­దా­రుల సద­స్సు ము­గి­శాక ఆయన వి­లే­క­రుల సమా­వే­శం­లో మా­ట్లా­డా­రు. ఐదే­ళ్ల­లో 50లక్షల ఉద్యో­గా­లు, పదే­ళ్ల­లో కోటి ఉద్యో­గా­లు కల్పిం­చా­ల­న్న­ది తమ లక్ష్య­మ­ని తె­లి­పా­రు. 20 లక్షల ఉద్యో­గాల లక్ష్యా­న్ని 50 లక్ష­ల­కు పెం­చు­తు­న్నా­న­ని తె­లి­పా­రు.

రూ.3,65,304 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­ను రా­ష్ట్రా­ని­కి తీ­సు­కు­రా­వ­డ­మే లక్ష్యం­గా ఈ ఒప్పం­దా­లు కు­దు­ర్చు­కుం­ది. వీటి ద్వా­రా 1,26,471 మం­ది­కి ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­లు లభి­స్తా­య­ని అం­చ­నా. శు­క్ర­వా­రం 40 సం­స్థ­ల­తో కు­దు­ర్చు­కు­న్న ఒప్పం­దా­ల­ను కూడా పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కుం­టే ఈ రెం­డు రో­జు­ల్లో­నే ఏపీ ప్ర­భు­త్వం 75 ఎం­వో­యూ­లు కు­దు­ర్చు­కుం­ది. వీటి ద్వా­రా రూ.7,14,780 కో­ట్ల పె­ట్టు­బ­డు­లు రా­ష్ట్రా­ని­కి వచ్చే అవ­కా­శా­లు ఉన్నా­యి. అలా­గే 5,42,361 మం­ది­కి ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­లు లభి­స్తా­య­ని అం­చ­నా. భా­గ­స్వా­మ్య సద­స్సు సం­ద­ర్భం­గా సు­మా­రు రూ.10 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వస్తా­య­ని ప్ర­భు­త్వం అం­చ­నా వే­సిం­ది.

Tags:    

Similar News